
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

శాంత్రి భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అన్ని పోలీస్స్టేషన్ల నిర్వహణకు నిధులు మంజూరు చేశామని, ఠాణాలకు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 వేల చొప్పున ఇస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ యావత్ రాజకీయశక్తులు ఒక్కటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

లక్ష కోట్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మానవీయకోణాన్ని ఆవిష్కరించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

కొత్త రాష్ర్టానికి పరిపాలనాపరంగా వివిధ అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా అధిగమిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తంచేసింది.

పెదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న కొత్త రేషన్కార్డులు వచ్చేవరకు పాత కార్డుల ద్వారానే సబ్సిడీ సరుకులు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో రేషన్ డీలర్లు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

ఉద్యోగ నియామకాల ప్రక్రియను పెద్దఎత్తున చేపట్టేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీతోపాటు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నదని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వాటర్గ్రిడ్ పథకం అమలును ప్రయోగాత్మకంగా హైదరాబాద్కు సమీపంలో ఉన్న మండలాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిసారించామని, అందులోభాగంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.
Please contribute generously to the BRS Party.