
దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం, జీడీపీ వృద్ధిరేటులో పతనాన్ని పరిగణనలోకి తీసుకుని భారీ అంచనాలకు అస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ను ఉభయసభలలో ప్రవేశపెట్టింది.
రాష్ట్ర మంత్రివర్గంలో ఆరుగురు మంత్రులు కొత్తగా కొలువుదీరారు. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించాలని సీఎం కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయం మేరకు ఆరుగురికి అవకాశం కల్పించారు.

రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి.

తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ర్ర్టాలు వచ్చి నేర్చుకునే ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

బతుకమ్మ చీరెలు బతుకును మార్చాయి. బతుకమ్మ చీరె కొంగు బంగారంగా మారింది. సీఎం కేసీఆర్ ఆడబిడ్డకు అందిస్తున్న కానుక.. నేతన్నల జీవితాల్లో భరోసాను కల్పించాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. సరికొత్త జీవితాన్ని అందించాయి.

గ్రామాల్లో అమలుచేయాల్సిన 60 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటిదశలో 30 రోజుల ప్రణాళికను సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

సంవత్సరంలోపు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. పాలమూరు జిల్లాలో మొత్తంగా 15-20 లక్షల ఎకరాలకు సాగునీరంది.. సస్యశ్యామలం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉన్నప్పటికీ ఆ నిష్పత్తితో అడవులు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఈ స్థాయిలో అడవులను పునరుద్ధరించాలని చెప్పారు.
Please contribute generously to the BRS Party.