
హుజూరాబాద్లో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండానేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలిపారు.

సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుండె ధైర్యంతో బతకాలని కాంక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగంగానే ‘దళిత బంధు’ అనే మరో బృహత్తర పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు.

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే పర్మినెంట్గా జైల్లో ఉంటావ్.. రేవంత్ ఖబడ్దార్ అని రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.

ఇంద్రవెల్లిలో రేవంత్రెడ్డి మాటలు అన్నీ అబద్ధాలేనని.. అవి వింటే అమరుల ఆత్మలు ఘోషిస్తాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.

నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభ పెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. రేవంత్లాంటి దుర్మార్గుడిని తెలంగాణ సమాజం సహించదని చెప్పారు.

రేవంత్రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్లో పోటీచేసి గెలవాలని పీయూసీ చైర్మన్ ఏ జీవన్రెడ్డి సవాల్ విసిరారు. ఆయన జన్మలో సీఎం కాదు కదా.. కనీసం చప్రాసీ కూడా కాలేడని ఎద్దేవాచేశారు.

పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్కు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వం పటిష్టంగా ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ స్పష్టంచేశారు.

దళిత దండోరా మార్మోగింది. దళితుల జీవితాల్లో వెలుగు నింపడం లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు విడుదలచేయడంతో జిల్లాల్లో సంబురాలు మిన్నంటాయి.
Please contribute generously to the BRS Party.