
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు అన్నారు.

సీమాంధ్రుల వలస పాలనలో దిక్కుమొక్కూలేకుండాపోయిన తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు మహర్దశ ప్రారంభమైంది.

టీఆర్ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.సభ్యత్వాలు స్వీకరించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ లక్ష్యాన్ని మించి నమోదవుతున్నది. మంగళవారం మహాశివరాత్రి పర్వదినం రోజు సైతం ప్రజలు సభ్యత్వం తీసుకునేందుకు క్యూ కట్టారు.

తెలంగాణ, మహారాష్ట్రల మధ్య తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ఇరురాష్ర్టాల మధ్య కీలక అవగాహన కుదిరింది.

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చొరవపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వాల నమోదుకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా జనం వెల్లువలా తరలివస్తుండటంతో పండుగ వాతావరణం నెలకొంటున్నది.

ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలహారం పథకాన్ని రూపొందించి ఇంటింటికీ నల్లాతో మంచినీటి సరఫరాకు కంకణం కట్టుకుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

పలు ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం కలుసుకోనున్నారు.

అయ్యప్ప దర్శనంకోసం తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి కేరళ ప్రభుత్వం సంతోషపూర్వక అంగీకారం తెలిపింది.
Please contribute generously to the BRS Party.