
కృష్ణా జలాల్లో మన వాటా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే కాదు, అవసరమైతే దేవునితోనైనా కొట్లాడుతామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.

టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి రాష్ట్రంలో ఏ పార్టీకీ లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తికాదు.. మహా శక్తి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు.

నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికీ విద్య, ఉద్యోగాల్లో సమాన వాటా దకుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాదీపం వెలిగించారు. ఆకలిని, అవమానాలను అనుభవిస్తూ అణచివేతకు, అభద్రతకు గురవుతున్న దళితుల్లో సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు.
ఊరూ, వాడా, పల్లె, పట్నం ‘ప్రగతి’ కోసం కదిలాయి. తెలంగాణను పచ్చనిహారాలుగా మలుచుకునేందుకు నడుంబిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం తెలంగాణకు హరితహారంతోపాటు నాలుగో విడత పల్లె ప్రగతి, మూడోవిడత పట్టణ ప్రగతి కార్యక్రమాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.

ప్రతి ఊర్లో అందరూ ఐక్యంగా ఉండాలని.. అభివృద్ధే మనందరి కులం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ప్రతి ఊరూ ప్రగతిబాటన పయనించాలని, అద్భుతమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణకు బీజేపీ చేసిందేమిటని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రజల నుంచి తీసుకోవడమే తప్ప.. నయాపైసా ఇచ్చింది లేదని మండిపడ్డారు.

తెలంగాణ రైతు రాజ్యమని, ఇక్కడ రైతు కేంద్రంగా అమలవుతున్న పథకాలే అందుకు నిదర్శమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహాయం అందించడానికి కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ సహాయ ప్యాకేజీ ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Please contribute generously to the BRS Party.