సుదీర్ఘకాలం పోరాటం చేస్తే కేంద్రం ఆంక్షలతో కూడిన తెలంగాణనే ఇచ్చిందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు.
దేశంలో కాంగ్రెస్ ఘోర పరాభావం ఎదుర్కోబోతుందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు.కాంగ్రెస్కు ఓటేస్తే మురిగిపోవడం ఖాయం. కాంగ్రెస్కు దేశ వ్యాప్తంగా 70 సీట్లు కూడా రావు.

అణు బాంబు దాడులకు గురైన జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలను మించిన విధ్వంసం తెలంగాణలో ఆంధ్ర ముఖ్యమంత్రుల పాలనలో జరిగిందని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చెప్పారు.

బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం ఫ్లోరైడ్ నివారణకు రూ.6 వేల కోట్లు నల్లగొండ బహిరంగసభలో గులాబీ దళపతి

మ్యానిఫెస్టోల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చారో చెప్పడానికి బహిరంగ చర్చకు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిద్ధం కావాలి.

కరీంనగర్ గడ్డమీద నుంచి ఓ పాలసీని ప్రకటిస్తున్నా… తెలంగాణ రాష్ట్ర సమితి నూటికి నూరుశాతం సెక్యులర్ పార్టీ. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదు.

తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన తాము ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కొట్లాడుతానని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు.

ప్రజల చేతిలో పావలా పెట్టి.. ముప్పావలా తమ జేబుల్లోకి వేసుకునే కాంగ్రెస్ నేతల తరహా అభివృద్ధి తమకు చేతకాదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు అన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, నూటికి నూరు శాతం తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

తన పార్టీ నాయకత్వాన్ని, అభ్యర్థులను పూర్తి స్థాయిలో.. అస్త్రశస్త్రాలతో ప్రచారంలోకి దించేందుకు టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నది.
Please contribute generously to the BRS Party.