
పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ఏం చేశారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.

తెలంగాణ ఉద్యోగులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల వర్షం కురిపించారు. పీఆర్సీ, హెల్త్కార్డులపై సానుకూలత వ్యక్తం చేయడంతోపాటు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలలో పదోన్నతులకు శుక్రవారం జీవో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

రాబోయే నాలుగేండ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నామని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు.

మెదక్ ఉప ఎన్నికల్లో రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.

మూడున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పారు.

మెదక్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కేంద్రీకరించి పని చేస్తుండగా.. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సభతో కొత్త జోష్ సంతరించుకుంది.

అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి
Please contribute generously to the BRS Party.