
నాగరికతకు దూరంగా ఉన్న చెంచులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఇకపై నెలకోసారి నిమ్స్ డాక్టర్లతో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తామని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.

ఎర్రజొన్న రైతుల రెక్కల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని, అందుకే బకాయిలను చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర తొలి బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఒకే గొడుగుకిందికి చేరారు. రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (టీఆర్టీయూ), తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం (టీపీఆర్టీయూ) విలీనమై ఒకే సంఘంగా ఏర్పాటై టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేసేందుకు నిర్ణయించాయి.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతర ప్రభుత్వ వైద్య సేవలందిస్తామని, ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠ పరుస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్ను చూపిస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

రాష్ట్ర రైతులకు చెందిన సాగుభూముల్లో త్వరలోనే భూసారపరీక్షలు నిర్వహించి పరీక్షల సమగ్ర సమాచారంతో రైతులకు భూసారకార్డులు (సాయిల్ హెల్త్కార్డు)ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

తెలంగాణ మహిళలు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

అంతర్జాతీయ మేయర్ల సదస్సు (మెట్రో పొలిస్)ను హైదరాబాద్లో అక్టోబర్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు తెలిపారు.

మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపే సత్తాలేక బలవంతంగా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.
Please contribute generously to the BRS Party.