
వాటర్గ్రిడ్ అమలవుతున్న తీరుతెన్నులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి గుజరాత్లో మంత్రి కేటీఆర్ రెండోరోజుల పర్యటన ఆదివారం ముగిసింది.

పులిచింతల ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే 20 టీఎంసీల నీటి నిల్వకు సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కరానికి ఇంటింటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

మినీడెయిరీల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన ఫీజు బకాయిలను మొత్తం చెల్లిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు.

హైదరాబాద్ నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూపు కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు.

రాష్ర్టానికి కీలకమైన ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభమవుతుందని చెరువుల పునరుద్ధరణపై నియమించిన క్యాబినెట్ సబ్కమిటీ చైర్మన్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు.
Please contribute generously to the BRS Party.