
తెలంగాణ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరైన ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

జలహారం పనులు ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.

రాష్ట్రంలోని పేదలు, సామాన్యుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రైల్వేప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల విధివిధానాలు రూపొందిస్తామని పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

రెండు, మూడు వారాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీఇచ్చారు.

ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు స్పష్టంచేశారు.

ఇచ్చిన మాట ప్రకారం నాలుగున్నర నెలల్లో ఇండ్లు కట్టి చూపిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు.

ఫిబ్రవరి రెండోవారంనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపడుతామని పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ప్రకటించారు.

ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు.
Please contribute generously to the BRS Party.