Author Archives: BRSpartyonline

ఐజీఎస్టీ బకాయి 2,641 కోట్లు

రాష్ర్టానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయి రూ.2,641 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌ను డిమాండ్‌ చేశారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టాలకు ఇవి ఎంతో అవసరమని చెప్పారు. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌పై వివిధ రాష్ర్టాల ఆర్థికమంత్రుల బృందం మంగళవారం సమావేశమైంది.


రైతన్నకు రక్షణ కవచం

‘భూమి అంటే రైతుకు ప్రాణం కంటే ఎక్కువ. తరతరాలుగా వచ్చిన చట్టాలన్నీ అలాంటి భూమి నుంచి కేవలం శిస్తు వసూలుకోసమే నిర్దేశించాయి. కానీ రైతు కేంద్రంగా ఒక్క చట్టం కూడా రాలేదు. అందుకే ఇప్పుడు వచ్చిన నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనది కూడా’ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి


రైతన్న నోట్లో కేంద్రం మట్టి

ఒక్క తెలంగాణలోనే 12 లక్షల ఎకరాల్లో 24 లక్షల టన్నుల మక్కలు పండుతాయి. ఇక దేశవ్యాప్తంగా ఉత్పత్తిని ఊహించుకోండి. మన దగ్గర పండిన మక్కలకే దిక్కులేదంటే.. ఉల్టా దిగుమతి చేసుకుంటే మన రైతు పరిస్థితి ఏమిటి? అతడు పండించే మక్కల్ని ఏం చేయాలి? అసలే కరోనా కాలం. ఖజానాకు ఆదాయం లేదు.


రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన టీఆర్ఎస్‌

అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులను వ్య‌తిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించింది. స‌భా కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. ఇవాళ రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మాట్లాడారు. వ్య‌వ‌సాయ బిల్లుపై ఓటింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని వ్య‌తిరేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.


సకల మతాల సర్కారు మాది

రాష్ట్రంలో సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి విధానాలను అమలుచేస్తూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


మా సొమ్ము.. మా హక్కు

తెలంగాణలో తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్‌ఎస్‌.. జాతీయస్థాయిలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్న జీఎస్టీ బకాయిలపై గళమెత్తింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశంపై చొరవతీసుకుని ఆందోళనకు దిగింది.


పారదర్శకంగా ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

డబుల్‌ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగాలని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.


‘తెలంగాణ పోరాటాల స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రగతిశీల పాలన’

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విలీన దినాన్ని పురస్కరించుకొని నాటి పోరాటాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ స్మరించుకున్నారు. నిజాం రాచరిక, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం వీరోచిత పోరాటాలు చేసిన పుణ్యభూమి తెలంగాణ ప్రాంతం అని వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.


ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశవ్యాప్తంగా సగటు పట్టణ జనాభా 31.2 శాతంగా ఉంటే తెలంగాణలో 42.6 శాతానికి చేరుకున్నదని తెలిపారు.


తెలంగాణభవన్‌లో జాతీయ జెండాఎగురవేసిన కేటీఆర్‌

తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ తల్లి ప్రతిమకు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.