Author Archives: BRSpartyonline

టీఆర్‌ఎస్‌ వెన్నంటే బీసీలు

బీసీలు జీవితాంతం టీఆర్‌ఎస్‌ వెన్నంటే ఉంటారని బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపుఇచ్చారని.. ఉన్నతవర్గాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం బీసీలకు ఏంచేసిందో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు.


కేంద్రాన్ని, ఆంధ్రాను కడిగేద్దాం

రాష్ట్ర నీటిహక్కులను హరించేందుకు కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వేదికగా నిజాలను తేటతెల్లం చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ జలవనరులశాఖకు చెందిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలు తీసుకొని సమావేశానికి రావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


బతుకమ్మ చీరెలు రెడీ

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతిఏటా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరఫున అందించే చీరెలను అక్టోబర్‌ 9 నుంచి పంపిణీచేస్తామని ఐటీ, చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. కరోనా నేపథ్యంలో స్వయంసహాయక సంఘాలతో ఇంటింటికీ అందజేస్తామని తెలిపారు.


పట్టణ పేదలకు టైటిల్‌ హక్కు

పట్టణాల్లో ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్‌ హక్కు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఏండ్లుగా నివాసముంటూ ప్రభుత్వానికి బిల్లులు చెల్లిస్తున్న పట్టణ పేదలకు ఆయా స్థలాలపై టైటిల్‌ హక్కులు కల్పిస్తామని తెలిపారు.


గెలుపే లక్ష్యం

ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా, అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలకు పదును పెడ్తున్నారు. త్వరలో జరుగనున్న హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించేలా ముందుకు సాగుతున్నారు


పేదోళ్లకు హక్కు

వ్యవసాయేతర ఆస్తులపై ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను పరిష్కరించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆస్తి హక్కులు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అవసరమైతే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


దసరాకు ధరణి

రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆయువుపట్టుగా మారనున్న ధరణి పోర్టల్‌.. దసరా పర్వదినాన ప్రారంభం కానున్నది. విజయదశమిని ప్రజలు శుభదినంగా భావిస్తున్నందువల్ల ఆ రోజున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఆలోగానే ధరణికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ శనివారం అధికారులను ఆదేశించారు.


గమనంలో అదే విశ్వాసం

ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన పాలకులు తమ పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే సోయి లేకుండా ప్రభుత్వాలు నడిపారు. ఇలాంటి పాలనా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పు లు తీసుకురావాల్సిన అవసరం ఉందని గ్రహించిన కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.


మ్యుటేషన్‌ ఉచితం

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయభూముల వద్ద, బావులకాడి ఇండ్లు, ఫామ్‌హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉచితంగా మ్యుటేషన్‌ (ఎన్‌రోల్‌) చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.


పోరుబాటలోనే జవాన్‌.. కిసాన్‌

దేశ సరిహద్దుల్లో జవాన్లు పోరాడుతున్నారని, మరో వైపు రైతులు సమస్యల పరిషారం కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ ప్రారంభం సందర్భంగా.. వ్యవసాయబిల్లులపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు.