Author Archives: BRSpartyonline

దమ్ముంటే నాపై కేసు పెట్టండి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా తనపై కేసు పెట్టాలని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు సవాలు విసిరారు. ‘హైదరాబాద్‌ నగరంలోని ఐడీపీఎల్‌ నుంచి రోడ్లు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలిస్తున్నరంట.. అధికారులు.. కార్మికుల మీద కేసులు పెట్టడం కాదు.. నీకు చేతనైతే.. కేసు పెట్టాల్సివస్తే మున్సిపల్‌శాఖ మంత్రిగా నా మీద, ప్రభుత్వం మీద కేసు పెట్టండి’ అని అన్నారు.


నై జవాన్‌.. నై కిసాన్‌!

నాలుగేండ్ల పాటు సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిన పని చేయించుకొని విసిరికొట్టే దుర్మార్గ విధానం ‘అగ్నిపథ్‌’. ఇది అటు సైన్యానికీ, ఇటు యువతకూ అవమానం. యువత ఆగ్రహానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అట్టుడుకుతూ ఉంటే కేంద్ర పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకే యువత తిరుగుబాటును ప్రతిపక్షాల రాజకీయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నరు.


రూ. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్మేందుకు మోదీ స‌ర్కారు య‌త్నం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం య‌త్నిస్తోంద‌ని, వీటికి రాష్ట్ర స‌ర్కారు కేటాయించిన భూముల‌ విలువ సుమారు రూ. 40వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు


మోదీ తుగ్లక్‌ విధానాలపై ఇక పోరుబాటే

ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు


ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం : మంత్రి కేటీఆర్

కృష్ణా జ‌లాల్లో వాటాను తేల్చ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. నార్లాపూర్, ఏదుల‌, వ‌ట్టెం, క‌రివెన‌, ఉద్ధండాపూర్, పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ద్వారా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు


వర్తమాన చరిత్రహీనులు!

దేవుళ్లను, గ్రంథాలను అడ్డుపెట్టుకొని, కనీసం వాటిని చదువకనే, దేవుళ్ల బోధను ఆచరించకనే, వారి పేర నీచ రాజకీయాలు చేస్తుంటరు కొంతమంది. వీరు వర్తమానంలోని చరిత్రహీనులు. మరింత ప్రమాదమేమంటే.. బండరాయి లాంటి వీరు తాము మునుగుతూ దేశాన్ని కూడా ముంచుతరు.


రాష్ట్రానికి నిధులపై అమిత్‌ షావి అన్నీ అబద్ధాలే.. మహబూబ్‌నగర్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌

మసీదులు తవ్వుతామంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు మసీదులు తవ్వితే.. మేం అభివృద్ధి పనులకు పునాదులు తవ్వుతాం. ప్రార్థనాలయాలు కాదు.. చేతనైతే దేవరకద్రలోని బీడు భూములు తవ్వి నీరు పారిద్దాం. మేంగుడులు కడుతున్నాం. వాటితోపాటే ప్రాజెక్టులు కూడా కడుతున్నాం. యాదాద్రి లాంటి గొప్ప ఆలయం నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే.


రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం ప్రసంగం

అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారింది.


అభివృద్ధికి నడక నేర్పించాం..

పట్టుదలకు మరోపేరు కేసీఆర్‌.నిబద్ధతకు నిలువుటద్దం ఆయన. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే. ప్రజలే ఆయన ఆస్తి. ప్రజల గుండెల్లో బంధువుగా ముద్రవేసుకొని.. పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ.. పరిపాలనాదక్షుడిగా నీరాజనాలు అందుకుంటున్న నేత కేసీఆర్‌. ఉద్యమ నాయకుడే సంక్షేమ సారథిగా ఉంటే రాష్ట్రం ఎలా వెలుగొందు తుందో నిదర్శనంగా ఉన్నది ఎనిమిదేండ్ల తెలంగాణ.