
కరోనా తర్వాత ఐటీ విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలకు మాతృభూమికి సేవచేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు ముందుకొస్తే సహకరిస్తాం. కరీంనగర్లో టీ హబ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తాం.

రాష్ట్రంలో నీటిపారుదలశాఖను ఇకపై జలవనరులశాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్) గా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయరాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతున్నదన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటిపారుదలశాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరుగాలని సీఎం చెప్పారు.

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. కరోనా వైరస్ సోకినవారు అధికవ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్యసిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని వెల్లడించారు. ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కొవిడ్-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో పాటు కిందిస్థాయి వరకు ప్రాణాలకు తెగించి గొప్పసేవ చేస్తున్నారన్నారు.
ఇప్పటివరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదని, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సాగునీటిరంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. కాళేశ్వరంతోపాటు, పలు ప్రాజెక్టుల నిర్మాణంతో పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడిందని, వాటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిరైతుకూ సాగునీరందాలని చెప్పారు.
తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది. తెలంగాణ రైతులు యావత్ దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలువబోతున్నారు. నిన్నమొన్నటిదాకా ఎవరికి వారన్నట్టుగా అసంఘటితంగా ఉన్న తెలంగాణ రైతులోకం ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందించి సంఘటితమయ్యారు.
అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేండ్లలో గోదావరి బేసిన్ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో వంద టీఎంసీల జలా ల వినియోగానికే పరిమితం కాగా, ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది.
ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలి. ఎంతటి సంక్షోభం ఉన్నా సంక్షేమం ఆగొద్దు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలి.
– సీఎం కేసీఆర్ ఆలోచన ఇది.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది 360 డిగ్రీల వ్యక్తిత్వమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పీవీ మన తెలంగాణ ఠీవి అని, ఆయనో నిరంతర సంస్కరణశీలి అని కొనియాడారు.
Please contribute generously to the BRS Party.