
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నిబద్ధతతో పనిచేశారని, ఉద్యమ శత్రువులను ఎండగట్టడంలో, ప్రతిఘటించడంలోనూ ఎంతో సాహసంతో వ్యవహరించారని గుర్తుచేశారు.

రాష్ట్ర మంత్రివర్గం ప్రగతి భవన్ లో సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నది. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

కేంద్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు అన్నారు. మోదీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం తెలంగాణభవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది.

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు రాష్ట్రాలకు దానిపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం న్యాయపరంగా, నైతికంగా, ఇచ్చిన మాట మీద నిలబడి రాష్ట్రాలకు పూర్తి పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మస్తిష్కంలోనుంచి పుట్టిన ఒకే ఒక్క రైతుబంధు పథకంతో తెలంగాణలో రైతు జీవితాన్ని.. వ్యవసాయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. యావత్ దేశానికి దిక్సూచిగా మారింది. దేశంలోని రైతులందరికీ ఆలంబనగా నిలిచింది .

ప్రపంచవ్యాప్తంగా నూతన టెక్నాలజీ దూసుకువస్తున్నదని, దీనిద్వారా సామాన్యుల జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరమున్నదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ర్టాలకు ఇవ్వాలని సూచించారు. పరిహారం తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఈ మొత్తాన్ని కేంద్రమే రుణం తీసుకోవాలని డిమాండ్చేశారు. పరిహారాన్ని రూ.1.65 లక్షల కోట్లకు పరిమితం చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్ముఖర్జీ ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు.

పట్టణాల్లో ఓ పద్ధతి ప్రకారం పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకు పురపాలికలను వందశాతం గ్రీనరీగా మార్చేలా ప్రణాళిక రూపొందించింది. మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు ఆదివారం ‘గ్రీన్స్పేస్ ఇండెక్స్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు.
Please contribute generously to the BRS Party.