
వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నానని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. పార్లమెంటుకు ఏ స్థానంనుంచి పోటీ చేయాలనేది కేకే ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.

కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చేప్పే దమ్ములేక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దిగజారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు మండిపడ్డారు.

గత కొద్ది రోజులుగా తనపై విమర్శలు కురిపిస్తున్న రాజకీయ నాయకులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆంధ్ర ఉద్యోగులను పంపిస్తామని, పోలవరం అడ్డుకుంటామని కేసీఆర్ అన్నందుకు నిన్న విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ సమాధానం చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో వెయ్యిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల మంది జైళ్లకుపోయారు. జైళ్లకు వెళ్లినవారిని విడిపించేందుకు బెయిల్ కోసం రెండుకోట్ల రూపాయల వరకు కట్టాం. కానీ ఉద్యమంలో అన్ని రకాల బాధలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ తెచ్చాం, ఇచ్చాం అంటుంటే సిగ్గేస్తోంది.
పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో ఉంచాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ముంపు మండలాలను తెలంగాణలో ఉంచేందుకు పోరాడుతాం. పోలవరం డిజైన్ మార్చాల్సిందే. డిజైన్ మార్చే వరకు పోలవరం కట్టనివ్వం.
రాబోయే రోజుల్లో జన తెలంగాణను తయారుచేసుకుందాం. అందరం సమానంగా బతుకుదాం. సమానంగా బతికే తెలంగాణను తయారు చేసుకుందాం. ఇలా తయారుచేస్తామనే సంపూర్ణ విశ్వాసం నాకుంది అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను బలపరిస్తే బంగారు తెలంగాణను చేసి చూపిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్ పరిష్కరిస్తుందని ఆపార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
ఆంధ్రా పార్టీలేవైనా వాటిని హటావో అనే అనాలి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు పేర్కొన్నారు.
Please contribute generously to the BRS Party.