Author Archives: BRSpartyonline

జాతీయపార్టీలు విఫలం
దేశంలో జాతీయ రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, ఆ రెండు జాతీయ పార్టీలకు (బీజేపీ, కాంగ్రెస్కు) ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయాలుగా మారబోతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

సాగునీటిరంగానికి కొత్తదశ
స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ పీఠభూమిపై మునుపెన్నడూ కనీవినీ ఎరుగని జలనిధిని చూసి అపరభగీరథుడు, సీఎం కేసీఆర్ ఉప్పొంగిపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో రేయింబవళ్లు ఏ కలనైతే కన్నారో.. ఆ కల సాకారమైన దృశ్యాన్ని చూసి పులకించిపోయారు.

తుపాకులగూడెం ఇక ..సమ్మక్క బరాజ్
గోదావరినది మీద నిర్మాణమవుతున్న తుపాకులగూడెం బరాజ్కు ఆదివాసీ వీరవనిత, వనదేవత సమ్మక్క పేరుపెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉన్నందున తెలంగాణలో అభివృద్ధి అనుకున్నరీతిలో సాగుతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.

బడి… మన బాధ్యత
చరిత్ర చదవడమే కాదు. చరిత్ర సృష్టించాలి. బడే ఇందుకు వేదిక. పేరు ప్రభుత్వ పాఠశాల అయినంత మాత్రాన వాటికి సంబంధించిన అన్ని పనులనూ ఒక్క ప్రభుత్వమే చేయలేదు. అలా చేయాలని అనుకోవడమూ సరికాదు.

పాలనకు ప్రజలే కేంద్రం
రాష్ట్రంలో ప్రజలు కేంద్రంగా పురపాలన సాగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే.. సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా.. విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలిగించేలా అత్యంత కఠిన చర్యలు కూడా తీసుకొంటామని హెచ్చరించారు.

రాష్ర్టానికి ఏమిచ్చారు?
‘కేంద్రంలో ఆరేండ్ల పాలనలోని ఆరుబడ్జెట్లలో తెలంగాణకు చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన దానికంటే అరపైసా అదనంగా ఇచ్చారా?’అని బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు.

ఆదర్శ పురపాలన
దేశం మొత్తంలోనే ఆదర్శవంతమైన పురపాలన అందిస్తామని.. మున్సిపల్శాఖ మంత్రిగా ఆ బాధ్యత తనదని.. ఇందులో కీలకపాత్ర మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లదేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.

కాంగ్రెస్, బీజేపీల మైండ్ బ్లాక్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, బీజేపీలకు కండ్లు బైర్లు కమ్మి మైండ్ బ్లాక్ అయిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.

కేంద్రాన్ని నిలదీయండి
రాష్ర్టానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజనచట్టంలోని హామీలు, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నిర్ణయించింది.

