-ప్రజాక్షేత్రంలో విచారణ ఇప్పటికే మొదలైంది
-దొరికిన దొంగలపై నార్కో టెస్టుకు సిద్ధమా?
-సీబీఐకి బదలాయిస్తే మీకెందుకు సంబురం?
-హైకోర్టు సీబీఐకి ఇస్తే, క్లీన్చిట్ ఇచ్చిందంటారా?
-పంజరంలో చిలుక మీ పలుకే పలుకుతుందనా?
-సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్..!
-సద్దులు మోసిన బీజేపీ.. సుద్దులు చెప్తే ఎలా?
-స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్నోళ్లు
-ఇప్పుడు చంకలెందుకు గుద్దుకొంటున్నరు?
-బీజేపీ తీరును తూర్పారబట్టిన మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే బీజేపీ ఎందుకు సంబురాలు చేసుకొంటున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సూటిగా ప్రశ్నించారు. కోర్టు తీర్పును ‘బీజేపీ విజయం’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సంబురాలు చేసుకోవడంలో మర్మం ఏమిటని మంగళవారం నిలదీశారు. ఈ కుట్రతో తమకు సంబంధమే లేదన్న బీజేపీ, కోర్టు తీర్పుపై ఇంతగా ఎందుకు ఖుషీ అవుతున్నదని ప్రశ్నించారు.
ఇన్నాళ్లు కలుగులో దాకున్న ఎలుకలు మెల్లిగా బయటకు వచ్చాయని, దొంగలు తమ నిజమైన రంగులను బయట పెట్టుకొంటున్నారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్ను బీజేపీ మించిపోయిందని విమర్శించారు. ‘ఒకప్పుడుసీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళు. ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. సీబీఐ దర్యాప్తుతోపాటు దొరికిన దొంగలకు నారో అనాలసిస్, లై డిటెక్టర్ టెస్టులు చేసేందుకు సిద్ధమా? దొరికిన ముగ్గురు దొంగలకు లై డిటెక్టర్ టెస్టులు చేస్తే, వాళ్లకు మీకు (బీజేపీకి) ఉన్న బంధం ఏమిటో తేటతెల్లమైతది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నరా? కేంద్రమంత్రి కిషన్రెడ్డి నా సవాల్ను స్వీకరించాలి’ అని కేటీఆర్ అన్నారు.
సంబంధం లేదన్నవాళ్లకు సంబురాలా?
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో దొరికిన స్వామీజీలతో తమకు సంబంధమే లేదన్నో ళ్లు, ఈ కేసు సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకొంటున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీ బండారమంతా కెమెరా కన్నుకు చికినప్పుడే, మీ వెన్నులో వణుకు మొదలైంది. అప్పుడు భుజాలు తడుముకొన్న మీరు.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు. మీకు ఏ సంబంధం లేకపోతే కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అడ్డుకొనే ప్రయత్నం ఎందుకు చేశారు? కేసును సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు కిషన్రెడ్డి? మీ జేబు సంస్థ చేతికి కేసు చికినందుకేనా ఈ పట్టలేనంత సంతోషం? పంజరంలో చిలుక మీరు చెప్పినట్టే పలుకుతుందని చెప్పకనే చెప్తున్నారా? కేసు సీబీఐకి వెళితే బారా ఖూన్ మాఫ్ చేసి స్వామీజీలకు క్లీన్ చిట్ ఇవ్వడం పకా అని ఇంత పబ్లిగ్గా మాట్లాడతారా? సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ సంపూర్ణంగా భ్రష్టుపట్టించిన తీరుకు మీ నిస్సిగ్గు ప్రకటనలే నిదర్శనం కాదా?’ అని ప్రశ్నించారు. ఒకప్పుడు సీబీఐకి కేసు ఇస్తే నిందితులు భయపడేవారని, ఇవ్వాళ సీబీఐకి కేసు అప్పజెప్తే సంబరాలు చేసుకొంటున్నారంటేనే ఆ సంస్థను బీజేపీ పాలనలో ఎంత నీరుగార్చారో అర్థమవుతున్నదని విమర్శించారు. బీజేపీ వ్యవహారం ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉన్నదని ధ్వజమెత్తారు.
ప్రజాకోర్టులో తప్పించుకోలేరు
బీజేపీది అధికార బలంతో ఏమైనా చేయొచ్చనే కుటిల నీతి అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘ఎనిమిదిన్నరేండ్ల పాలనతో మీరు (బీజేపీ) ప్రజాక్షేత్రంలో ఎప్పుడో బద్నాం అయిపోయారు. బీజేపీని కొత్తగా బద్నాం చేయాల్సిన ఖర్మ మాకు లేదు. బీజేపీ దగ్గర విషయం లేదు కాబట్టే 8 ఏండ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో ‘విషప్రయోగం’ చేస్తున్నది. బీజేపీ దగ్గర సరుకు లేదు కాబట్టే.. ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా ఇకడా ప్రభుత్వాన్ని కూల్చాలని చేసిన ఆపరేషన్ లోటస్ కుట్ర బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయిన దొంగలు బీజేపీ నేతలు.
దేశంలో గత ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన సిగ్గులేని చరిత్ర మీది. దొంగలకు సద్దులు మోసిన బీజేపీ నేతలు, ఇప్పడు సుద్దులు చెప్తే నమ్మేదెవరు? మీ చేతిలోని కీలుబొమ్మలు సాగించే విచారణ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రపై ప్రజాక్షేత్రంలో బీజేపీపై నిజమైన విచారణ ఎప్పుడో ప్రారంభమైంది. నేరం చేసినవాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరు. సరైన సమయంలో తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం సిద్ధంగా ఉన్నది’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.