తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయానికి ముఖ్యకారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టిన ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన పని చూసే ప్రజలు తెరాసకు ఓటు వేశారని, తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితం… తెరాస ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందంటున్న మంత్రి కేటీఆర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/trs-party-president-and-minister-ktr-on-telangana-municipal-election-results/ts20200125151126115