
రాష్ట్రంలో పల్లెప్రగతి రెండోవిడుత కార్యక్రమం గురువారం సందడిగా ఆరంభమైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట, గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు శ్రీగాధలో పల్లెప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు.

ఈ దశాబ్దం తెలంగాణదేనని, టీఆర్ఎస్ నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా రాష్ట్రం నిలువబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. మున్సిపల్ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడమే ఈ సంవత్సరం తన లక్ష్యమని తెలిపారు.

తాను కలలుగన్న తెలంగాణ ఇప్పుడు కండ్లముందు కనిపిస్తున్నదని, హృదయపూర్వక సంతోషం కలిగిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. మిడ్మానేరు ప్రాజెక్టుపై నిలబడి పూజచేస్తున్నప్పుడు గొప్ప సాఫల్యత సాధించిన భావనకు గురయ్యానన్నారు.

ఎన్నికలేవైనా విజయాలను చిరునామాగా మార్చుకున్న టీఆర్ఎస్ మరోసారి ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవనున్న నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది.

హైదరాబాద్ను అద్భుత నగరంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి, టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమపథకాలే ఎజెండాగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపోల్స్లో టీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తంచేశారు.

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నది. శుక్రవారం తెలంగాణభవన్లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ నేతలకు దిశానిర్దేశం కేటీఆర్ చేయనున్నారు.

సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన కేటీఆర్.. సీఎం నమ్మకాన్ని వమ్ముచేయలేదు! పక్కా వ్యూహరచనతో పార్టీని విజయపథాన నడిపించడంతోపాటు.. క్యాడర్కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతున్నారు.

పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. వివిధ ప్రమాదాల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అందించారు.
Please contribute generously to the BRS Party.