
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్కు అండగా ఉంటూ వస్తున్నదని గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా, కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుండా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్-పెద్ద మరూర్ దగ్గర బరాజ్ నిర్మించి తీరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఈ బరాజ్తో రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని తేల్చిచెప్పారు.

గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎట్టకేలకు మంగళవారం జరుగనున్నది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల సీఎంల అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశానికి సర్వం సిద్ధమయింది. కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు.

నీళ్ల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడమంటే నవ్వాల్నా, ఏడ్వాల్నా తెలియడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్కు రాసిన లేఖ తొలిసారి అని చెప్పడం వారి అవగాహనలేమిని బయటపెడుతున్నదని అన్నారు

మున్సిపాలిటీలు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధి, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితంగా స్వచ్ఛతలో వరుసగా మూడుసార్లు పంచాయతీరాజ్శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

బీసీలు జీవితాంతం టీఆర్ఎస్ వెన్నంటే ఉంటారని బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపుఇచ్చారని.. ఉన్నతవర్గాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం బీసీలకు ఏంచేసిందో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

రాష్ట్ర నీటిహక్కులను హరించేందుకు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదికగా నిజాలను తేటతెల్లం చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ జలవనరులశాఖకు చెందిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలు తీసుకొని సమావేశానికి రావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతిఏటా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరఫున అందించే చీరెలను అక్టోబర్ 9 నుంచి పంపిణీచేస్తామని ఐటీ, చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. కరోనా నేపథ్యంలో స్వయంసహాయక సంఘాలతో ఇంటింటికీ అందజేస్తామని తెలిపారు.

పట్టణాల్లో ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్ హక్కు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఏండ్లుగా నివాసముంటూ ప్రభుత్వానికి బిల్లులు చెల్లిస్తున్న పట్టణ పేదలకు ఆయా స్థలాలపై టైటిల్ హక్కులు కల్పిస్తామని తెలిపారు.

ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా, అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలకు పదును పెడ్తున్నారు. త్వరలో జరుగనున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్, నల్లగొండ-వరంగల్- ఖమ్మం స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించేలా ముందుకు సాగుతున్నారు
Please contribute generously to the BRS Party.