Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

బీజేపీది అహంకారం.. అసహనం

బీజేపీ రాష్ట్ర నేతలు అహంకారంతో, అసహనంతో వ్యవహరిస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ఎన్ని నాటకాలు వేసినా టీఆర్‌ఎస్‌కు ప్రజల్లోనుంచి కొంచెంకూడా ఆదరణ తగ్గకపోవడాన్ని కాషాయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.


ఆందోళన వద్దు.. అందరికీ సాయం

హైదరాబాద్‌లో అర్హులైన వరద బాధితులందరికీ తక్షణ ఆర్థికసాయం రూ.పదివేలు అందజేస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హామీ ఇచ్చారు. సాయం అందలేదని బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు.


బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తా!

రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం రూ.11వేల కోట్ల వరకు ఖర్చు పెడుతున్నదని, ఇందులో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.105 కోట్లేనని చెప్పారు. తాను చెప్తున్నది అబద్ధమని రుజువుచేస్తే ఒక్క నిమిషంలో తన పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్‌ బీజేపీ నేతలకు సవాల్‌ చేశారు.


బీజేపీది గంటకొక అబద్ధం.. పూటకొక వదంతి

బీజేపీతో తస్మాత్‌ జాగ్రత్త. బీజేపీ నాయకులు అబద్ధాల పునాదులపై అధికారంలోకి రావాలని చూస్తున్నారు. దుబ్బాకలో గెలువాలని ప్రయత్నిస్తున్నారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. వారి పట్ల దుబ్బాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మోసపోతే గోస పడుతం. తస్మాత్‌ జాగ్రత్త. – మంత్రి హరీశ్‌రావు


ధరణి శకం

యావత్‌ దేశానికే మార్గదర్శనం కాగల.. చరిత్రాత్మక భూ పరిపాలనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీకారంచుట్టారు. అన్ని రకాల భూ లావాదేవీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడంకోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి వెబ్‌ పోర్టల్‌ను.. గురువారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కార్యాలయంలో ప్రారంభించారు.


అభివృద్ధికే ఓటేస్తరు.. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

ప్రజాభిమానాన్ని నమ్ముకున్న టీఆర్​ఎస్​ ఒకవైపు, తప్పుడు ప్రచారాలను నమ్ముకున్న కాంగ్రెస్, బీజేపీ మరోవైపు దుబ్బాక ప్రజల ముందు పరీక్షకు నిలబడ్డాయి. ప్రజల కోసం పని చేసేవారెవరో, సీజనల్​గా వచ్చే వైరస్​ల మాదిరిగా ఎన్నికలప్పుడు వచ్చి హడావుడి చేసేదెవరో గ్రహించలేనంత అమాయకులు కారు దుబ్బాక ప్రజలు.


నవ శకానికి నాంది

రెవెన్యూ సమస్యలతో విసిగి వేసారిన రైతన్న మోము వికసించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ధరణీ’శకానికి నాంది పలికారు. ఏండ్ల తరబడి సాగుతున్న అక్రమాలు, అవకతవకలకు చరమ గీతం పాడారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో గురువారం ధరణి పోర్టల్‌ను పండుగ వాతావరణంలో ప్రారంభించారు.


గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి దుబ్బాక రుణం తీర్చుకుంటా

‘బీజేపోళ్లు మన పిల్లలకు సీసలిస్తరట.. గా సీసలతో బతుకుతమా? కాళేశ్వరం నీళ్లు జీవితాంతం వస్తయి.. మన బతుకులు మారుతయి. గోదావరి నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటా’ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


సోషల్‌మీడియాలో గులాబీదళం

సోషల్‌ మీడియాలో ఏ పార్టీకి లేనంతగా స్వచ్ఛంద సైనికులు టీఆర్‌ఎస్‌కు ఉన్నారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉద్యమసమయం నుంచి నేటిదాకా కేసీఆర్‌ నాయకత్వాన్ని టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా స్వచ్ఛంద సైనికులు బలపరుస్తూ వస్తున్నారని చెప్పారు.


టీఆర్‌ఎస్‌దే దుబ్బాక

ఎవరెన్ని ఎత్తులేసినా, ఎన్ని కుట్రలు పన్నినా దుబ్బాకలో గెలిచేది ముమ్మాటికీ టీఆర్‌ఎస్సేనని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.