ఎవరూ వెంట రాకున్నా ఇదెలా సాధ్యమైంది? ఎందుకంటే ఒక పనిని మొదలుపెట్టేముందు కేసీఆర్ ప్రధానంగా స్వశక్తినే నమ్ముకుంటారు. ఇతరుల బలాన్ని కాదు. అందువల్లే కేసీఆర్ మీద, తలపండిన రాజకీయవేత్తల అంచనాలు కూడా తారుమారవుతుంటాయి.

నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)పై సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు.

బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్.. అబద్ధాలు చెప్పడం తప్ప ఆయనకేమీ తెలియదు అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో 60 ఏండ్ల దారిద్రాన్ని ఆరేండ్లలో తీర్చామని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.

సాగునీటి శాఖకు నూతన జవసత్వాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. కొత్త సంవత్సరం ప్రారంభంతోనే ఈ నూతన వ్యవస్థ అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

పాఠశాల కరికులంలో ఆవిష్కరణలను ఒక అంశంగా ప్రవేశపెట్టాలని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకతకు పెద్దపీట వేయాలన్నారు.

ప్రభుత్వం రైతు సంక్షేమానికి నిరంతర ప్రయత్నం చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాయికోడ్ గ్రామంలో ‘వరం’ (రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం) కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.

ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకొంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని వెల్లడించారు.
1.52 కోట్ల ఎకరాలకు సోమవారం నుంచి డబ్బులు జమ చేయనున్నాం. ఇందుకు రూ.7,515 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ప్రతి గుంట భూమికీ సాయమందాలి.
-కేసీఆర్
Please contribute generously to the BRS Party.