
కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచి, ఆమోదించిన పలు హామీలను నెరవేర్చడం లేదు.

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పేదల పక్షపాతి అని సీఎం కేసీఆర్ అన్నారు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి.

ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు అమ్ముతున్నరని అడిగితే విశాఖలో మీకేం పని అంటరా? ఏం విశాఖ భారత్లో లేదా.. మేం భారతీయులం కాదా? మాట్లాడొద్దా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ ఉద్యోగులే, ఈ పట్టభద్రులే, ఈ యువకులే, ఈ విద్యావంతులే ఉద్యమంలో జనానికి ధైర్యం చెప్పారు. జాగృతం చేశారు. ప్రత్యర్థుల వాదనలను పదునైన మాటతో కకావికలం చేశారు. ఇప్పుడూ తెలంగాణ బాధ్యత వారిదే.

ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తానన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.

ప్రశ్నించడమే కాదు.. దానికి సమాధానం వెతకాలి. పరిష్కారం చూపించాలి. మీరు ప్రశ్నలు మాత్రమే వేయగలరు. మేము ప్రశ్నలకు సమాధానం, పరిష్కారం చూపగలం.

స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతోనే మాజీ ప్రధాని వీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే మరొకరు ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు.

‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు
Please contribute generously to the BRS Party.