
తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏప్రభుత్వం ఎప్పుడూ,ఎక్కడా ప్రవేశపెట్టని పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే విధంగా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు.

తెలంగాణలో దేశంలోకెల్లా అతిపెద్ద ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేస్తామని అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా తెలిపింది.

గవర్నర్కు అధికారాలపై టీఆర్ఎస్ ప్రారంభించిన పోరాటంతో కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి హోంశాఖ పంపిన ఉత్తర్వులకు సోమవారం తాత్కాలిక బ్రేక్ వేసింది

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పోలీసులకు అవసరమైన బడ్జెట్ను రూపొందించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు

తమ ప్రభుత్వం కేంద్రంతో యుద్ధాన్ని కోరుకోవడంలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఒకవేళ హోంశాఖ తన లేఖను ఉపసంహరించుకోకపోతే మాత్రం ఇతర మార్గాలు, ఉపాయాలను అనుసరించాల్సి వస్తుందని అన్నారు.

హైదరాబాద్ అధికారాలను గవర్నర్కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంతో పార్లమెంటు వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.
Please contribute generously to the BRS Party.