
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఐటీ, పంచాయితీ రాజ్శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు.

గిరిజన బాలికపై లైంగిక దాడి, అడ్డుకున్న తల్లిపై లైంగికదాడికి యత్నం సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు రైల్వేలైన్ నిర్మిస్తే ఐదేండ్లపాటు నష్టాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. బక్రీద్ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ సలీం ఇంట్లో సీఎం కేసీఆర్ విందుకు …

అనేక త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో పునర్నిర్మాణ బాధ్యత చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి అడుగు ఆచితూచి వేస్తుందే తప్ప, ఎవరి గోలకో గొడవకో తత్తరపడి నిర్ణయాలు తీసుకోదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అయిన టిష్మ్యాన్ స్పియర్ గతంలో ప్రకటించిన తెల్లాపూర్ టెక్నో సిటీ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ముందుకువచ్చింది.

అక్టోబర్ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పల్లె, పల్లెకూ.. గడపగడపకూ తెలిసేలా ప్రచారం చేయడానికి తెలంగాణ సాంస్కృతిక వారధిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు

వంద రోజుల్లో చేసిందేమీలేదు. ఇప్పుడే మొదలుబెట్టినం. సమగ్ర సర్వేతో సమాచారమంతా తీసుకున్నం. ఇగ మైలపోలుతీస్తం. దసరా నుంచి సంక్షేమ పథకాలు అమలుచేస్తం.. ఇదీ తన వందరోజుల పాలన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుక సాక్షిగా చెప్పినమాట!
Please contribute generously to the BRS Party.