Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

రూ. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్మేందుకు మోదీ స‌ర్కారు య‌త్నం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం య‌త్నిస్తోంద‌ని, వీటికి రాష్ట్ర స‌ర్కారు కేటాయించిన భూముల‌ విలువ సుమారు రూ. 40వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు


మోదీ తుగ్లక్‌ విధానాలపై ఇక పోరుబాటే

ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు


ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం : మంత్రి కేటీఆర్

కృష్ణా జ‌లాల్లో వాటాను తేల్చ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. నార్లాపూర్, ఏదుల‌, వ‌ట్టెం, క‌రివెన‌, ఉద్ధండాపూర్, పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ద్వారా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు


వర్తమాన చరిత్రహీనులు!

దేవుళ్లను, గ్రంథాలను అడ్డుపెట్టుకొని, కనీసం వాటిని చదువకనే, దేవుళ్ల బోధను ఆచరించకనే, వారి పేర నీచ రాజకీయాలు చేస్తుంటరు కొంతమంది. వీరు వర్తమానంలోని చరిత్రహీనులు. మరింత ప్రమాదమేమంటే.. బండరాయి లాంటి వీరు తాము మునుగుతూ దేశాన్ని కూడా ముంచుతరు.


రాష్ట్రానికి నిధులపై అమిత్‌ షావి అన్నీ అబద్ధాలే.. మహబూబ్‌నగర్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌

మసీదులు తవ్వుతామంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు మసీదులు తవ్వితే.. మేం అభివృద్ధి పనులకు పునాదులు తవ్వుతాం. ప్రార్థనాలయాలు కాదు.. చేతనైతే దేవరకద్రలోని బీడు భూములు తవ్వి నీరు పారిద్దాం. మేంగుడులు కడుతున్నాం. వాటితోపాటే ప్రాజెక్టులు కూడా కడుతున్నాం. యాదాద్రి లాంటి గొప్ప ఆలయం నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే.


రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం ప్రసంగం

అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారింది.


Format C-2

Format C-2 of TRS candidates for biennial election to the council of states for the constituency – by the elected members of Telangana Legislative Assembly.


Format C-7

Format C-7 of TRS candidates for biennial election to the council of states for the constituency – by the elected members of Telangana Legislative Assembly.


తెలంగాణకు ఆశీర్వాద్‌

దావోస్‌లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పెట్టుబడి అనుకూల విధానాలకు పారిశ్రామికవేత్తలు ఫిదా అవుతున్నారు. తొలిరోజు లూలు కంపెనీ 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా.. కీమో ఫార్మా మరో వంద కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకొన్నది.


లూలు 500 కోట్లు

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) సమావేశాల్లో తొలి రోజే తెలంగాణకు భారీగా పెట్టుబడులు దకాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.