Author Archives: BRSpartyonline

కలిసికట్టుగా కదలండి

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.


ఎన్నికల బరిలో మనమే

మున్సిపల్‌ ఎన్నికల బరిలో మనమే ముందు న్నాం. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల గ్రౌండ్‌ ఖాళీగా ఉన్నది. టీఆర్‌ఎస్‌ తప్ప మరెవరూ లేరు.. ఈ ఎన్నికల్లో మన పార్టీ ఘన విజయం ఖాయం. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కు సానుకూల వాతావరణం ఉన్నది అని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు.


ద్వితీయ నగరాలకు ఐటీ

రాష్ట్రంలో అన్ని ద్వితీయశ్రేణి నగరాలకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని విస్తరిస్తామని, వరంగల్‌ నుంచి ఆ విస్తరణ ప్రారంభమయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.


ప్రజలంతా మనవైపే

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరించాలని చెప్పారు.


రేపు టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం (ఈ నెల 4) ఉదయం 11.30 గంటలకు తెలంగాణభవన్‌లో జరుగనున్నది.


ప్రగతిబాటన పల్లె

రాష్ట్రంలో పల్లెప్రగతి రెండోవిడుత కార్యక్రమం గురువారం సందడిగా ఆరంభమైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మోహినికుంట, గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు శ్రీగాధలో పల్లెప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.


ఈ దశాబ్దం తెలంగాణదే

ఈ దశాబ్దం తెలంగాణదేనని, టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా రాష్ట్రం నిలువబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. మున్సిపల్‌ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడమే ఈ సంవత్సరం తన లక్ష్యమని తెలిపారు.


కేసీఆర్‌ కలగన్న తెలంగాణ ఇదే

తాను కలలుగన్న తెలంగాణ ఇప్పుడు కండ్లముందు కనిపిస్తున్నదని, హృదయపూర్వక సంతోషం కలిగిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మిడ్‌మానేరు ప్రాజెక్టుపై నిలబడి పూజచేస్తున్నప్పుడు గొప్ప సాఫల్యత సాధించిన భావనకు గురయ్యానన్నారు.


గులాబీ సమరోత్సాహం

ఎన్నికలేవైనా విజయాలను చిరునామాగా మార్చుకున్న టీఆర్‌ఎస్‌ మరోసారి ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవనున్న నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది.