
‘అభివృద్ధి విషయంలో మీ ఊరికి మీరే ఓ కేసీఆర్ కావాలి. గ్రామాలను బాగుచేసుకోవాలనే పట్టుదల ఉండాలి. బాగుచేస్తేనే ప్రజలు హర్షిస్తారు. సీఎం కేసీఆర్ ఆలోచనావిధానంతో పనిచేయాలి. 70 ఏండ్లుగా పల్లెలన్నీ చెత్తకుప్పలుగా మారాయి. పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పు వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే పట్టణప్రగతి కార్యక్రమంతో పట్టణాలు, నగరాలు కళకళలాడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
ఆకుపచ్చ తెలంగాణను ఆకాంక్షించిన జననేత కలను తెలంగాణ సమాజం సాకారంచేసింది. సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 66వ పుట్టినరోజున లక్షలకొద్దీ మొక్కలునాటి ప్రకృతినే పరవశింపజేసింది.

ప్రజల జీవనప్రమాణాలను పెంపొందించేలా పట్టణప్రగతి కార్యక్రమం ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 24 నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించింది.

తెలంగాణకు నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వవిప్ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. మెట్రో నిధులపై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

దేశంలో జాతీయ రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, ఆ రెండు జాతీయ పార్టీలకు (బీజేపీ, కాంగ్రెస్కు) ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయాలుగా మారబోతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ పీఠభూమిపై మునుపెన్నడూ కనీవినీ ఎరుగని జలనిధిని చూసి అపరభగీరథుడు, సీఎం కేసీఆర్ ఉప్పొంగిపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో రేయింబవళ్లు ఏ కలనైతే కన్నారో.. ఆ కల సాకారమైన దృశ్యాన్ని చూసి పులకించిపోయారు.

గోదావరినది మీద నిర్మాణమవుతున్న తుపాకులగూడెం బరాజ్కు ఆదివాసీ వీరవనిత, వనదేవత సమ్మక్క పేరుపెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉన్నందున తెలంగాణలో అభివృద్ధి అనుకున్నరీతిలో సాగుతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రంలో ప్రజలు కేంద్రంగా పురపాలన సాగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే.. సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా.. విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలిగించేలా అత్యంత కఠిన చర్యలు కూడా తీసుకొంటామని హెచ్చరించారు.

‘కేంద్రంలో ఆరేండ్ల పాలనలోని ఆరుబడ్జెట్లలో తెలంగాణకు చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన దానికంటే అరపైసా అదనంగా ఇచ్చారా?’అని బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు.
Please contribute generously to the BRS Party.