
దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయంపై సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొగులు చూసి కాలమెట్లా అవుతుందో ఊహించేవాడు కర్షకుడు. కాలమాన పరిస్థితి చూసి భవితను అంచనా వేసేవాడు నాయకుడు.

రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినా.. చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

కొడంగల్ నియోజక వర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

‘యాభైఏండ్ల చరిత్రలో ఎన్నడూ చూడని జలదృశ్యం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆవిష్కృతమైంది. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. ఏ తెలంగాణ అయితే కరువు నేల అన్నారో.. అన్నం తినే సంస్కారం కూడా లేదంటూ వెక్కిరించిండ్రో.. ఆ తెలంగాణే నేడు దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగింది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

‘పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న నానుడిని నిజంచేస్తూ గ్రామీణప్రాంతాల్లో చేపలను దిగుమతిచేసుకునే స్థితినుంచి ఎగుమతిచేసే స్థాయికి ఎదుగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల కోసం అమలుచేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికోసం వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం చేస్తున్న కృషిపై కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా ప్రచారంచేస్తున్నాయని వైద్యశాఖ అధికారులు, నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు.

ఎంపీ రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. వట్టినాగులపల్లిలో 111జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫాంహౌస్పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రీయ ప్రాతిపదికన నిర్వహించేలా (ఆపరేషన్) సాంకేతిక తెరకు రూపకల్పన జరుగుతున్నది. ఒక భారీప్రాజెక్టుపై‘డ్యాష్బోర్డు’ను రూపొందించడం దేశంలో ఇదే ప్రథమం.

గోదావరిపై దుమ్ముగూడెం దిగువన తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సీతమ్మబరాజ్ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామని పనులు దక్కించుకున్న ఎల్అండ్టీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదలచేసింది.

రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు.
Please contribute generously to the BRS Party.