
ప్రాణాలకు తెగించి కొట్లాడి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన బీఆర్ఎస్ను ప్రజలంతా గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు. కాంగ్రెస్కు అధికారమిస్తే చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, ఈ ఎన్నికల్లో వెయ్యిశాతం తామే గెలుస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు నెలలకు ఒకరు సీఎం కావడం ఖాయం.. ఐదేండ్లలో పది మంది సీఎంలు వస్తారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

రైతులను అన్యాయంగా అరిగోసపెట్టిన రాబందు పార్టీ కాంగ్రెస్ అయితే రైతుబంధు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ది.

తెలంగాణ తెచ్చిన నేను ఒకవైపు.. వచ్చిన తెలంగాణను విచ్ఛినం చేసేందుకు వస్తున్న రేవంత్ ఒకవైపు.. ఎవరిని ఏం చేయాలో మీకు తెలుసు..

జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకెళ్లే దొంగ కావాలా.. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? కేసీఆర్ పెట్టిన స్కీములు కావాలా? లేక కాంగ్రెస్ స్కాములు కావాలా..

కరెంటు కనబడడం లేదన్న రేవంత్రెడ్డి, జగ్గారెడ్డికి తాను బంపరాఫర్ ఇస్తున్నానని, తాము ఏర్పాటు చేసిన ఏసీ బస్సులో సంగారెడ్డి నియోజకవర్గంలోని ఏదో ఒక ఊరుకు వెళ్లి వైర్లు పట్టుకుంటే కరెంటు ఉందో? లేదో తెలుస్తుందని అన్నారు.

‘ఇయ్యాల ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నోళ్లకు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రాష్ట్రాన్ని కూడా అమ్మరా? పార్టీ టికెట్లనే అమ్ముకునే నాయకులు రాష్ట్రాన్ని కాపాడుతరా?

‘వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలు అని కాంగ్రెస్వాళ్లు అంటున్నారు. మరి సరిపోతదా? రైతుబంధు దుబారా అంటున్నా రు.. దుబారానా?

ఉమ్మడి పాలమూరు కరువుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు గోస తప్పదని, ఇందుకు మన పక్కనే ఉన్న కర్ణాటకే ప్రత్యక్ష ఉదాహరణ అని హెచ్చరించారు.
Please contribute generously to the BRS Party.