Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

జనం చూస్తున్నారు

రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న మహాసంకల్పంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రెవెన్యూశాఖలో ఉన్నతాధికారులు మొదలు కిందిస్థాయి ఉద్యోగి వరకు సమిష్టిగా, సానుకూల దృక్పథంతో పనిచేస్తూ, ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.


ప్లానింగ్‌.. విజనింగ్‌.. డిజైనింగ్‌

-హెచ్‌ఎండీఏలో ఈ మూడింటిపై దృష్టిపెట్టండి -టీఎస్‌ బీపాస్‌ చట్టంతో మార్పులు అనివార్యం -సిద్ధంగా ఉండాలని సూచించిన మంత్రి కేటీఆర్‌ హెచ్‌ఎండీఏ …


ఇది ఆరంభమే..తెలంగాణలో విప్లవాత్మక ప్రజా చట్టం

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అన్నది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని వర్గాలవారికి భూ సంబంధిత ఇబ్బందులు తొలిగించేలా దశలవారీగా మరిన్ని మెరుగైన విధానాలను తీసుకొని రానున్నామని శుక్రవారం శాసనసభ వేదికగా ప్రకటించారు.


హైదరాబాద్‌ అభివృద్ధికి 30వేల కోట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. నగర అభివృద్ధికోసం సుమారు రూ.30వేల కోట్లను వెచ్చించనున్నామని, ఇప్పటికే రూ.6వేల కోట్ల విలువైన పనులను పూర్తిచేశామని వివరించారు.


ఫార్మాసిటీపై కుట్రలు

అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగిన హైదరాబాద్‌లో ఫార్మాసిటీని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంటే భూసేకరణ జరగకుండా కొందరు రాజకీయ దురుద్దేశంతో కుట్రలు చేస్తున్నారని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు.


చట్టం సూపర్‌

రైతుకు మట్టి వాసననిచ్చిన నేల.. మధ్యతరగతి జీవికి వెలుగు బతుకైన నేల.. మనిషికి బతుకుతనాన్నిచ్చిన ఈ నేలకు.. శతాబ్దాలుగా పడిన సంకెళ్లను తెంచడానికి భూమి పుత్రుడు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాహసోపేతంగా వేసిన అడుగు నూతన రెవెన్యూ చట్టం తెలంగాణమంతటా ఆకాశమంత సంబురాన్ని తెచ్చింది.


డిసెంబర్‌ నాటికి టీ-హబ్‌ రెండోదశ

టీ-హబ్‌ రెండో దశ ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తుందని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. నాలుగు వేల మంది ఔత్సాహిక అంకుర పారిశ్రామికవేత్తల కోసం రాయదుర్గం ప్రాంతంలోని మూడెకరాల్లో 3.5 లక్షల చదరపు అడుగుల్లో రూ.276.26 కోట్లతో టీ-హబ్‌ రెండోదశ నిర్మిస్తున్నట్టు చెప్పారు.


నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌కు చెందిన పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులతో గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.


తెలంగాణ భూమి తల్లికి పట్టాభిషేకం

‘తెలంగాణ వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇవాళ అంతే సంతోషంగా ఉన్నా. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులకు, నిరుపేదలకు, నోరులేనివారికి అండగా నిలిచే చట్టాన్ని తీసుకొస్తున్నాం. సరళీకృతమైన, అవినీతిరహితమైన ఇంత గొప్ప చట్టాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


జీహెచ్‌ఎంసీ మనదే

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 94 నుంచి 104 సీట్ల వరకు గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇప్పటికే నాలుగు సర్వేలు చేశామని, అన్ని సర్వేల్లో ఇదే విషయం తేలిందని చెప్పారు. హైదరాబాద్‌లో గత ఆరేండ్లలో మనం ఏం చేశామో ఆ పనులు చెప్పుకుంటే చాలన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.