
తెలంగాణలో తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్ఎస్.. జాతీయస్థాయిలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్న జీఎస్టీ బకాయిలపై గళమెత్తింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశంపై చొరవతీసుకుని ఆందోళనకు దిగింది.
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగాలని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్తోపాటు జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినాన్ని పురస్కరించుకొని నాటి పోరాటాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్మరించుకున్నారు. నిజాం రాచరిక, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం వీరోచిత పోరాటాలు చేసిన పుణ్యభూమి తెలంగాణ ప్రాంతం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశవ్యాప్తంగా సగటు పట్టణ జనాభా 31.2 శాతంగా ఉంటే తెలంగాణలో 42.6 శాతానికి చేరుకున్నదని తెలిపారు.

తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పలువురు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి ప్రతిమకు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

హైదరాబాద్ నగరం అన్నిరంగాల్లో మేటిగా నిలిచేందుకు అద్భుత కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక దేశం రాజధానికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు హైదరాబాద్లో మెండుగా ఉన్నాయి. అటు అభివృద్ధికి, ఇటు ప్రజల జీవనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తనదైన తరహాలో ముందుకు పోతున్నది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో విద్యుత్పై రాష్ర్టాలకున్న అధికారం పోతుందని, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారు.

ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేసే టీఎస్బీపాస్ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు ప్రవేశపెడుతూ దాని విశేషాలను, ప్రభుత్వ బాధ్యతలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, అక్రమార్కులపై చర్యలు.. ఇలా బిల్లులో పొందుపరిచిన అన్ని విషయాల గురించి కూలంకషంగా వివరించారు.

దేశ సమస్యలతోపాటు తెలంగాణ రాష్ట్ర సమస్యలను కూడా పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని లోక్సభ టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులే కాకుండా దేశంలో ప్రస్తుత సమస్యలు కూడా పరిగణనలోకి తీసుకొని వాటన్నింటిపై చర్చించాలని డిమాండ్ చేశారు.
Please contribute generously to the BRS Party.