
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ.

జాప్యానికి చోటు ఉండదు.. అవినీతి, ఆలస్యం అనే మాటే వినపడదు. భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్ బీ పాస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు, రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీల్లో గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రాయితీ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపులో 50 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకూ దీపావళి కానుక ప్రకటించింది.

పట్టణ ప్రాంత నిరుపేదలకు బస్తీ దవాఖానలతో మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్నగర్ డివిజన్ సయ్యద్నగర్ -2 లో బస్తీ దవాఖానను మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఆధునిక పద్ధతిలో చెత్త తరలింపు, నిర్వహణతో హైదరాబాద్లో దుర్గంధం దూరం కానున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం చెత్త తరలింపునకు ఉపయోగిస్తున్న పాత వాహనాలకు కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వస్తి చెప్పనున్నామని.. వీటి స్థానంలో అత్యాధునిక కాంప్యాక్టర్లు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు.
టీఆర్ఎస్ పార్టీ విజయాలకు పొంగిపోదని, అపజయాలకు కుంగిపోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్కు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం వరద సాయం అందిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బురద రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వానలో తడుస్తూ, నీళ్లలో నడుస్తూ టీఆర్ఎస్ నేతలు బాధితులకు అండగా నిలిస్తే.. నాడు దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఇప్పుడొచ్చి చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీ విస్తరిస్తున్న తీరును పసిగట్టడం, వారిలో భరోసా నింపి వారి తదుపరి పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ను మార్చడంలో మంత్రి కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. అమెజాన్ చేసిన తాజా పెట్టుబడి ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూడటం ఖాయంగా కనిపిస్తున్నది.

తెలంగాణలో మత విద్వేషపు విత్తనాలకు చోటు లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇక్కడి మట్టిలోనే పరమత సహనం ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వమే శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు.. రైతు లు వద్దు.. కార్పొరేట్లు ముద్దు అన్నది బీజేపీ నినాదంగా మారిపోయిందని ఎద్దేవాచేశారు.

దుబ్బాక ఎన్నికల్లో సానుభూతి పొందే యోచనతో హైదరాబాద్లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ప్రగతిభవన్, డీజీపీ ఆఫీసు, తెలంగాణ భవన్ను ముట్టడించాలనే దుష్ట పన్నాగానికి తెరలేపిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
Please contribute generously to the BRS Party.