
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడంలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. ప్రతిరోజూ 12 గంటలు పనిచేస్తున్న కార్మికుల గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదని, మరింత కఠినమైన చట్టాలు తెచ్చి వారిని మరింత అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.

నాలుగు వందలున్న సిలిండర్ వెయ్యి దాటింది. పెట్రోలు రూ.120కి పెరిగింది. ఎయిర్ ఇండియా, ఎల్ఐసీని అమ్మకానికి పెట్టిన బీజేపీ అంటేనే ‘బేచో జనతాకి ప్రాపర్టీ’ అని మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్తులను అమ్మేసే పార్టీ) అని మరో కొత్త నిర్వచనం ఇచ్చారు.

రాష్ట్రానికి వరుస కడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు. తెలంగాణలో ఉండేది కేసీఆర్ మాత్రమే’ అని ట్వీట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైకో, లుచ్చా, బద్మాష్ మాదిరిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 75 ఏండ్లలో రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. కానీ, కేసీఆర్ సర్కారు ఏడేండ్ల పాలనలో ఏకంగా 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసింది. ఇదే మా పనితీరుకు నిదర్శనం’

మూడేండ్ల పదవీకాలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మభ్య పెట్టడం తప్పితే చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు.

ఉత్పాదక రంగాన్ని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ విమర్శించారు

బండి సంజయ్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదని, పేకాటలో జోకర్లా ఆయన వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.
Please contribute generously to the BRS Party.