
మాయకూటమికి ఓటేస్తే తెలంగాణలో నడుస్తున్న ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. తమిళనాడు, కర్ణాటకలో రైతులకు ఏ సమస్యలొచ్చినా అన్ని పార్టీలూ ఒక్కతాటిపై నిలిచి పోరాడుతాయి.

స్వీయ అస్థిత్వం, స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూటమి ముసుగులో వలసాంధ్ర పాలకులను తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.

తెలంగాణలో లౌకికతత్వం వెల్లివిరుస్తున్నదని, ప్రాంతాలు, వర్గాలు అనే భేదం లేకుండా వివక్ష లేని పాలన అందిస్తున్నామని మంత్రి కే తారకరామారావు అన్నారు.

రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని, మహాకూటమి ప్రభావం ఉండదని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు అన్నారు.

సీట్లు పంచుకోవడం చేతకానోళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు? ఈ ఎన్నికలు ఆషామాషీ కాదు అని మంత్రి సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేసేందుకు సిద్ధమైంది.

ఓట్లు వచ్చాయంటే కాంగ్రెసోళ్లు ఊళ్లోకి వస్తరని, పోలింగ్ అయిపోగానే పత్తాలేకుండాపోతరని మంత్రి టీ హరీశ్రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు చంద్రబాబు చేసిన ద్రోహాల్లో, పన్నుతున్న కుట్రల్లో కొన్నింటిని తన 19 ప్రశ్నల లేఖతో ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆదాయమార్గం అతి ముఖ్యమైనది. రాష్ట్ర అభివృద్ధి కోసం అందుబాటులోని వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచి.. పేదలకు పంచాలనేదే టీఆర్ఎస్ ఆర్థిక సిద్ధాంతం.

స్వరాష్ట్ర ఏర్పాటుకోసం 14ఏండ్లు అకుంఠిత దీక్షతో అలుపెరుగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ను ఓడించడానికి మాయమాటలతో ముందుకువస్తున్న మహాకూటమిని రాజకీయంగా బొందపెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు యువతకు పిలుపునిచ్చారు.
Please contribute generously to the BRS Party.