
మహాభారత యుద్ధంలో న్యాయం పాండవుల వైపు ఉన్నందున, శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. దీంతో కౌరవులు ఓడిపోయారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం సీఎం కేసీఆర్ వైపు ఉన్నది.

మహాకూటమి పొత్తు తెలంగాణ రైతుల పొట్ట కొట్టేదేకానీ.. మన ప్రయోజనాలను కాపాడేదికాదని, మాయాకూటమికి ఓటేస్తే మన మరణశాసనాన్ని మనమే రాసుకున్నట్టేనని మంత్రి కే తారకరామారావు అన్నారు.

కేసీఆర్ పద్నాలుగేండ్ల పాటు ఉద్యమంలో ప్రజలతో భాగస్వాములై తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి రాష్ర్టాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

నాలుగున్నరేండ్ల కేసీఆర్ పాలన టీజర్ మాత్రమేనని, దీన్నిచూసే ప్రతిపక్షాలు తట్టుకోలేకసిద్ధాంతాలు పక్కనపెట్టి కూటములతో ఒక్కటవుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

అయితే వద్దు, లేకుంటే రద్దు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని, అందుకే ఆ పార్టీని ప్రజలు మాకొద్దంటూ ఈసడించుకుంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు.

సమైక్యపాలనలో కరంటు అడిగితే కాల్చిచంపిన చరిత్ర కూటమిలోని పార్టీలదని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. మరోవైపు రాష్ట్ర రైతులకు ఉచితంగా కరంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు.

ప్రభుత్వం చేసిన అభివృద్ధే నినాదంగా.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా.. టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని, ఏ సర్వేలైనా ఇదేమాట చెప్తున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.

నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు.

గులాబీ దళాల ప్రచారం గ్రామగ్రామానా విస్తృతంగా సాగుతున్నది. భారీ ర్యాలీలు, మహిళల మంగళహారతులు, ప్రజల ఆశీర్వాదాలు శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి.
Please contribute generously to the BRS Party.