
హైదరాబాద్ నగరం అన్నిరంగాల్లో మేటిగా నిలిచేందుకు అద్భుత కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక దేశం రాజధానికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు హైదరాబాద్లో మెండుగా ఉన్నాయి. అటు అభివృద్ధికి, ఇటు ప్రజల జీవనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తనదైన తరహాలో ముందుకు పోతున్నది.

ఆప్తమిత్రుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూసాడనే వార్త వినటంతోనే నిలువెల్లా ఒక అంతులేని ఆవేదన ఆవరించింది. దుఃఖంతో కండ్లు చెమ్మగిల్లుతుంటే నిగ్రహించుకోవటం కోసం నిల్చున్న వాడినల్లా కొద్దిసేపు అట్లా కూర్చుండిపోయాను.

నియంత్రిత వ్వవసాయ విధానంలో ఏ పంట రకాలు ఎక్కడ సాగుచేయాలో ప్రభుత్వమే చెబుతుంది. దాని ప్రకారమే రైతులు పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడ ఏ పంటలు వేయాలన్నది ప్రభుత్వమే మ్యాపింగ్ చేసి, సమగ్ర వ్యవసాయ విధానాన్ని రాష్ట్రమంతా అమలయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని రైతులు గుండెలకద్దుకొని స్వీకరిస్తున్నారు.

ఆరేండ్ల నా తెలంగాణ ఓ పసి మొగ్గ. దేశ పటంలో ఒక కొత్త రాష్ట్రం. నాటి ఉద్యమ నాయకుడే నేటి తెలంగాణ ప్రభుత్వ అధినేత. బంగారు తెలంగాణ ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ నేడు దేశానికే దిక్సూచి. ఏ రంగంలో ఐనా తెలంగాణ ఓ రోల్ మోడల్. మెట్ట పంటలతో నెట్టుకొచ్చిన భూములు నేడు హరిత సింగారాల మాగాణాలై మెరిసిపోతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని పెద్దపిట్ట కూతలు, నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. అప్పట్లో పెద్దపిట్ట లాంటి కూతల వలె, ఇప్పుటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్ మాటలు కీడునే కోరుతున్నాయి. తెలంగాణ గడ్డ ఉన్నపళంగా పీనుగల దిబ్బగా మారితే శవ రాజకీయం చేయాలని కాటి కాడి నక్కల్లా కాచుకుని కూర్చున్నట్లు వారి మాటలు చెబుతున్నాయి.

బీజేపీ వైఫల్యాల జాబితా పెద్దదే. మొదటిది అంతర్జాతీయ ప్రయాణాలను అరికట్టే విషయంలో విఫలం, రెండవది ఢిల్లీ నడిబొడ్టున వేల మందితో తబ్లిగీ జమాత్ సమావేశం జరుగుతుంటే సమాచారం ఉండి కూడా నిర్లక్ష్యం చేయడం, మూడవది దేశవ్యాప్తంగా వలస కార్మికుల విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం. తద్వారా కేంద్రం దేశాన్ని గందరగోళంలో పడేసింది.

శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఉండటంతో సమాజాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలిస్తుంటాను. భిన్నవర్గాల ప్రజలతో నిత్యం సంభాషిస్తుంటాను. గ్రామీణ సమాజంలో వస్తున్న మార్పులను ఆసక్తిగా గమనిస్తుంటాను. నా పరిశీలన, అధ్యయనం, అనుభవం ఆధారంగా గ్రహించిన విషయాలను నేను మీతో పంచుకుంటున్నాను.

కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకొని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీచేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతి నెలా రూ.308 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.

తుంగతుర్తి గడ్డది దశాబ్దాల నీటిగోస. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల నిర్మాణం కోసం సాగిన నీటి పోరాటాల గోస చెప్పనలవి కానిది. కేసీఆర్ వచ్చేంత వరకు ఏ పాలకుడూ వీరి గోసను పట్టించుకోలేదు.

‘జంగిల్ బచావో- జంగిల్ బడావో’ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలతో పనిచేస్తున్నది. హరితహారం ఇప్పటికే ఐదు విడతలు పూర్తికాగా, ఆరో విడత కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నారు.
Please contribute generously to the BRS Party.