
ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆహ్వానించారు.

మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో పూర్తిచేయగలిగామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు ఎన్నికయ్యారు.

తలాపున పారుతున్న గోదారమ్మను మన బీళ్లకు తరలించి.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంచేయాలన్న ఆకాంక్షను.. మన భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేవలం రెండున్నరేండ్లలో నిజంచేసి చూపించారు.

అభివృద్ధిలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్గా తయారుకావాలని, ఈ మార్పు ఆరునెలల్లో రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

టీఆర్ఎస్ విజయాల పరంపర జెడ్పీ ఎన్నికలతో ఉన్నత శిఖరాన్ని చేరింది. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అన్నీ జెడ్పీలను ఏకగ్రీవంగా గెల్చుకున్న గులాబీదండు సరికొత్త రికార్డు సృష్టించింది.

ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధ్వజమెత్తారు.

నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. ఈ గెలుపుతో పొంగిపోకుండా ప్రజలతో కలిసి పనిచేయాలని వారికి సూచించారు.

పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది.

పల్లెల్లో గులాబీ తోటలు గుబాళించాయి! పరిషత్తు ఫలితాల్లో కారు టాప్గేరులో దూసుకుపోయింది! ఎన్నికలు ఏవైనా.. గెలుపు టీఆర్ఎస్దేనని మరోసారి రుజువైంది!
Please contribute generously to the BRS Party.