
రాష్ట్రం యూనిట్గా నీటి వినియోగం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులకు స్పష్టంచేశారు. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతున్నదని, అందరి బాధలను అర్థం చేసుకునే సీఎం కేసీఆర్ పాలనలో ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం లభిస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తున్నప్పటికీ పలుశాఖలు క్రియాశీలకంగా వ్యవహరించని తీరుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టిసారించారు.
రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం గ్రామ, మండ ల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, ఇందులో సభ్యుల సంఖ్య, ఎంపిక విధానం తదితర కీలక అంశాలతో ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

సమగ్ర భూ సర్వే విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతపై సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.

ఈ ప్రభుత్వంలో పేదలకు అందుతున్న ఫలాలు ఆరంభం మాత్రమేనని, సీఎం కేసీఆర్ మనసులో చాలా ఆలోచనలున్నాయని కేటీఆర్ చెప్పారు.

సంక్షేమ రంగంలో భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు.

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీపికబురు చెప్పారు. ఇప్పటి వరకు చేపట్టిన 27,660 నియామకాలకు తోడుగా మరో 84,876 ఉద్యోగాల ని యామక ప్రక్రియను సత్వరమే చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి న్యాయంచేస్తానని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్ట మీద 1996లో చెప్పిన తాను.. ఇప్పుడు సాధించుకున్న రాష్ట్రంలో సీఎం హోదాలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శంకుస్థాపన చేశానని, దీనితో తన జన్మధన్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
Please contribute generously to the BRS Party.