
దశాబ్దంన్నరపాటు అనేక ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సరైనమార్గంలో వెళుతున్నదని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకే ప్రభుత్వం పనిచేస్తూ ప్రజాసంక్షేమం దిశగా వేగంగా దూసుకుపోతున్నదని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్తో నడిస్తే పొలాలకు సాగునీళ్లు అందుతాయని, చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమి తి అభ్యర్థుల ప్రచారపర్వం వేగం పుంజుకున్నది. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రోజంతా ప్రచా రం చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరిస్తున్నారు. ప్రజలతో మమేకమ వుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఒకప్పుడు చంద్రబాబునాయుడినే భస్మంచేసిన హస్తంతో కలిసి వస్తున్న మహాకూటమితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కూటమికి అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమైపోతుంది అని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు.

తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. ఓట్లు, సీట్ల కోసం సిద్ధాంతాన్ని మార్చిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు.

రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని మంత్రి కే తారకరామారావు చెప్పారు.

కాంగ్రెస్ నాయకుల చిల్లర మల్లర ప్రయత్నాలు, దగుల్బాజీ వ్యవహారాలను ప్రజాకోర్టులోనే ఎండగట్టేందుకే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు మహాకూటమి అసలు పోటీయే కాదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
Please contribute generously to the BRS Party.