
సమైక్య పాలనలో రూపురేఖలు కోల్పోయిన గ్రామీణ నీటిపారుదల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నది.

స్వరాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల కష్టాలను తొలిగించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సత్ఫలితాలనిస్తున్నది.

రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సేంద్రియ విప్లవం దిశగా అడుగులు వేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లను మరో తిరుపూర్లా అభివృద్ధిచేస్తానని సిరిసిల్ల శాసనసభ్యుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.

ఈ వానకాలం సీజన్లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు అందించాలని, ఇందుకు అనువుగా జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుకావాలని.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నది. నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాలుగున్నరేండ్లలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతి సాధించింది.

తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు చాలా పెద్ద పథకమని.. ఇది రైతులందరికీ వర్తిస్తున్నదని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధా మిశ్రా అన్నారు.

మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

జంగల్ బచావో-జంగల్ బడావో నినాదంతో ఒకవైపు స్మగ్లర్లు, అటవీ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూనే.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటువేసింది.
Please contribute generously to the BRS Party.