తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. 80 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేసే విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో.. సమగ్ర భూ సర్వే విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతపై సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

