రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో జరిగిన మూడు రాజ్యసభ స్థానాలను మన పార్టీ గెలుచుకున్నది. పార్టీ అభ్యర్థులు సంతోష్ కుమార్ గారు, బడుగుల లింగయ్య యాదవ్ గారు, బండ ప్రకాశ్ గారు విజయం సాధించారు. పార్టీ అభ్యర్థులు బండ ప్రకాశ్ గారికి 33 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్ గారికి 32 ఓట్లు, జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి 32 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 108 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 10 ఓట్లు మాత్రమే పోలవ్వడంతో పరాజయం పాలయ్యారు.

